మేలిమి బంగారముకంటెను అపరంజికంటెను నావలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండికంటె నావలన కలుగు వచ్చుబడి దొడ్డది.
సామెతలు 8: 19
ప్రియులారా.. జ్ఞానము ఘోషించు చున్నది. వివేచన తన స్వరమును వినిపించుచున్నది. జ్ఞానమును సంపాదించడము, విలువైన బంగారము కంటెను అపరంజి కంటెను మంచిదని అది మనకు తెలియజేయుచున్నది. మనిషి తన జీవిత కాలములో ధనం సంపాదించుటకు, ధనవంతుడిగా ఉండుటకు ప్రయాసపడుతాడు కానీ జ్ఞానం తన దగ్గర ఉంటే ధనంతో పాటుగా కీర్తి ప్రతిష్టతలు కూడా వాటంతట అవే తన దగ్గరకు వస్తాయని గ్రహించడు. మన ప్రయాస దేవుని జ్ఞానం కోసమే ఉండాలి కానీ లోక ధనం కోసం కాదు.
దేవుని జ్ఞానం కలిగిన పౌలుభక్తుడు తనకు కలిగిన సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుచుకున్నాడు . అందువలననే జీవకిరీటమును పొందుకున్నాడు. జీవ కిరీటం మనకు శాశ్వతకాలం ఉంటుంది. కనుక మన ప్రయాస జీవకిరీటం కొరకే ఉండాలి ఈ జ్ఞానం మనకు ఏ విదంగా కలుగుతుంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి జ్ఞానం మెండుగా లబిస్తుంది. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి యుండుట జ్ఞానమునకు మూలం అని వాక్యం సెలవిస్తోంది
ప్రియులారా.. దేవుడిచ్చు జ్ఞానం వలన ఈలోకంలోనూ పరలోకంలోనూ మనం గొప్పవారముగా జీవించగలము. సొలొమోను దేవున్ని జ్ఞానం అడుగుట వలన దేవుడు జ్ఞానంతోపాటు కీర్తి ప్రతిష్టలను కూడా ఆయనకు దయచేసాడు. మనం కూడా దేవుని జ్ఞానం కోసం ఆశపడినట్లైతే దేవుడు జ్ఞానంతో పాటుగా ఐశ్వర్యమును గొప్ప పేరు ప్రతిష్టతలను మనకు అనుగ్రహిస్తాడు.
ఈ వాక్యం బంగారముకన్న దేవుని జ్ఞానం వలన కలుగు మేలు మంచిదని మనకు తెలియజేస్తుంది కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని జ్ఞానం కోసం ఆశపడుదాం.
దేవుడు తన జ్ఞానం ద్వారా మనలను ఆశీర్వదించును గాక.. ఆమెన్.
No comments:
Post a Comment