Breaking

Tuesday, 22 September 2020

వేదనాయగం శాస్త్రియార్ Vedanayagam

 


తంజావూరు రాజా వారి ఆస్థానంలో మంత్రులందరూ

కూడుకొనియుండగా రాజైన సెర్ఫోజి అక్కడ ప్రవేశించి తన సింహాసనం మీద ఆసీనులయ్యారు. రాజు గారికి సన్నిహిత స్నేహితుడు మరియు ఆస్థాన కవి అయిన

వేదనాయగం శాస్త్రియార్ రాజుగారి ప్రక్కనే కూర్చున్నారు.


ఆ రోజు రాజు శాస్త్రియార్ వద్ద ఒక వ్యత్యాసమైన కోరికను కోరారు. అదేమంటే రాజు యొక్క దైవాన్ని కీర్తిస్తూ ఒక పాటపాడమని అడిగారు. అయితే రాజు యొక్క కోరికను తీర్చలేనని చెప్పి భారమైన హృదయంతో ఇంటికి తిరిగి వచ్చిన శాస్త్రియార్  యొక్క విచార వదనం చూచి జరిగిన సంగతి తెలుసుకున్న అతని భార్య కూడా ఆ

బాధలో పాలుపంచుకున్నారు. ఆ సందర్భంలో అతను "యేసువైయే తుదిసెయ్ నీ మనమే, యేసువైయే తుదిసెయ్" (యేసునే స్తుతించు నా ప్రాణమా, యేసునే స్తుతించు) అనే పాటను వ్రాసి, తిరిగి రాజు సన్నిధికి వెళ్ళి అదే పాటను పాడారు. అటు తరువాత

ఎన్నడూ తన దైవం గురించి పాడమని రాజు అతనిని అడుగలేదు.

విశ్వాస జీవితంలో కదలకుండా స్థిరముగా నిలిచే శాస్త్రియార్ తనకున్న తలాంతుతో దేవుని మహిమార్థమై ఎన్నో పాటలను, కీర్తనలను వ్రాశారు. అంతేకాక 34 సంవత్సరాలు నిండకముందే 52కి పైగా పుస్తకాలను రచించిన ఇతను మంచి రచయిత

కూడా. "బెల్లెహేము కురవంజి" అనునది అతని ఉత్తమ రచనలలో ఒకటి. 1849 నూతన

సంవత్సర కూడికలో అతను పాడిన "పాడి తుది మనమే. పరనై కొండాడి తుది దినమే" (పాడి స్తుతించు నా ప్రాణమా, పరమదేవుని పొగడి కీర్తించు) అనే పాట ఎంతో ప్రసిద్ధి చెందింది. "సువార్త కవి" అని "దైవ జ్ఞానముగల కవి" అని పిలువబడిన వేదనాయగం

శాస్త్రియార్ వ్యక్తిగతంగా ఎన్ని బాధలు బాంధవ్యాలు ఉన్నా, పలు బాధ్యతలు అడ్డు వచ్చినా విడువక దేవునిని మహిమపరుస్తూ శ్రీలంక వరకూ సువార్తను మోసుకెళ్ళారు. అతనికి బైబిలు గురించిన జ్ఞానాన్ని అందించిన స్క్వార్జ్ అనే మిషనరీ అతనికి ఆత్మీయ తండ్రి అయ్యారు. క్రైస్తవ లోకానికి ఎన్నో సేవలనందించిన శాస్త్రియార్ యొక్క సంతతివారు కూడా "శాస్త్రీయారులు"గా పిలువబడి దేవునిని సేవించడం కొనసాగించారు.

గీతముల ద్వారా ఎంతో మందిని క్రీస్తు వైపుకు నడిపించారు. ప్రియమైనవారలారా, దేవుడు మీకు దయచేసిన తలాంతులను మీరు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు?

"ప్రభువా, నా నాలుకతో మిమ్ములను తప్ప వేరెవరినీ

నేను స్తుతించను. ఆమేస్!"


No comments:

Post a Comment