మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను.
యోబు 27: 5
ప్రియులారా సాతాను ద్వారా ఎంతో శ్రమలు అనుభవించిన యోబు భక్తుడు ఈ మాటను తన స్నేహితులతో అంటున్నాడు. ఆయనకు ఎన్ని శ్రమలు వచ్చిన తన యధార్ధతను విడువనని తెలియజేస్తున్నాడు. దేవుడు కూడా యోబు గురించి ఇతడు యదార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడు తనము విసర్జించిన వాడు అవి సాక్ష్యం ఇస్తున్నాడు.
ప్రియులారా దేవుడు యదార్థ వంతుల ప్రార్ధనను వినువాడై యున్నాడు ఆయన యదార్థ హృదయం గలవారి పక్షముగా వాజ్యమాడువాడై యున్నాడు అందుకే మనం యదార్థంగా జీవించుటకు ఇష్టపడువారమై యుండాలి దేవునికి దగ్గరగా మనం జీవించాలంటే మనం యదార్థతను ఎంత మాత్రమును విడువకూడదు.
ఈ వాక్యం మనం యదార్థ వంతులముగా ఉండాలని తెలియజేస్తుంది గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని దృష్టికి ఇష్టమైన వారమై జీవిద్దాం. యోబు వలే యదార్థ వంతలనుగా మనలను మార్చును గాక ఆమెన్
No comments:
Post a Comment