మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.
మత్తయి 5: 16
ప్రియులారా
మనము వెలుగు సంబంధులమై యున్నాము
గనుక మనలో చీకటికి ఏమాత్రము చోటివ్వకూడదు
దేవునిలో ఏ పాపము లేదు గనుక మనుము కూడా పాపము లేని వారమై యుండాలి
పేతురు ఈ విధంగా అంటున్నాడు
అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమ పరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై
ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను అని
ప్రియులారా
మనము బహుగా ఫలించుట వలన మన తండ్రి మహిమ పరచబడును గనుక మనము సత్క్రియలను
ఓపికగా చేయుచు దేవుని పోలిన వారమై యుండాలి
అప్పుడే మనుషుల మధ్యన దేవుడు మన ప్రవర్తన బట్టి మహిమ పరచబడతాడు
ఈ వాక్యం మనకు సత్క్రియలను చేసి దేవుణ్ణి మహిమ పరచాలని మనకు గుర్తు చేస్తుంది గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుణ్ణి మహిమ పరిచేవారమై జీవిద్దాం
దేవుడే మనకు వెలుగై ఉండును గాక ఆమెన్
No comments:
Post a Comment