Breaking

Saturday, 26 September 2020

నెహెమ్యా నీలకాంత శాస్త్రి గోరే Nehemiah Nilakantha Sastri Goreh

 


కొంతమంది దేవుని వాక్యాన్ని ప్రధానంగా ఇతరులతో వాదించడానికి చదువుతారు. వారు తమ చర్యలన్నింటినీ సమర్థించుకొనుటకు బైబిలు వాక్యములను వాడుకొంటారు. అది తప్పు అని వారు గ్రహించినప్పటికీ అలానే కొనసాగిపోతారు.

వారణాసిలోని ఒక సాంప్రదాయ చిత్సావస్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన నీలకాంత గోరే హిందూ శాస్త్రంలో మంచి ప్రావీణ్యాన్ని కలిగి ఉన్నారు. తన భక్తిని ప్రదర్శించే చర్యగా వారణాసిలో అంతకంతకూ చురుకుగా పెరుగుతూ ఇతరులను బాగా ప్రేరేపిస్తున్న వీధులలో ప్రసంగించే బోధకులను తరిమికొడతానని గోరే ప్రతిజ్ఞ చేశారు. తాను వారి మీద గెలిచి వారు తప్పు అని చూపించాలనే దృక్పథంతో సువార్తికులతోను, మిషనరీలతోను అతను వ్యూహాత్మకంగా వాదించేవారు. అందుకొరకు అతను బైబిలును చదివేవారు. కేవలం వాదముల కొరకే బైబిలు చదివినప్పటికీ దేవుని జీవముగల వాక్యం అతనిలో క్రియ చేయుట ఆరంభించింది. ఒకసారి అతను యేసు ప్రభువు యొక్క 'కొండ మీది ప్రసంగం' చదువుతుండగా ఆ వచనాలు అతని హృదయాన్ని

బలంగా తాకాయి. తన అంతరంగంలో నెలకొన్న గొప్ప పోరాటం తరువాత చివరికి అతను తనను తాను ప్రభువుకు అప్పగించుకున్నారు. బాప్తిస్మం తీసుకొనిన తరువాత అతని పేరు నెహెమ్యాగా మార్చబడింది. ఇది తెలుసుకున్న అతని కుటుంబం అతనిని అగౌరవపరిచి, తృణీకరించింది. ప్రారంభంలో తన సాక్ష్యాన్ని బహిరంగంగా పంచుకోవటానికి అతను సిగ్గుపడ్డారు. కానీ తరువాత అత్యధికమైన సిలువ శక్తి యొక్క సహాయముతో ధైర్యంగా సువార్తను పంచుకొనుటకు అతను నేర్చుకున్నారు. తన భార్యను మరియు సోదరుడిని మాత్రమే కాక పండిత రమాబాయిని కూడా క్రీస్తు వైపుకు నడిపించిన ఘనత కూడా అతనికే దక్కుతుంది. పేదల మధ్య సువార్తను ప్రకటిస్తూ, వినయపూర్వకమైన జీవితాన్ని గడుపుతూ అతను తన మిషనరీ సేవను ప్రారంభించారు. అతను ప్రజలకు బైబిలు సత్యాలను స్పష్టంగా మరియు

సమర్ధవంతముగా భోదించారు. అతను సువార్త ప్రకటించే శైలి ప్రజలను ఆకట్టుకుంది. ఒకసారి, అతను

ఇంగ్లాండ్ వెళ్లి భారత దేశములో సువార్తను ప్రకటించాల్సిన అవసరతను మరియు అందుకు

సంబంధించిన సలహాలను పద్దతులను సిఫారసు చేశారు. అతను హిందూ తత్వ శాస్త్రముపై

క్రైస్తవులకున్న అభిప్రాయాలను గురించి పలు పుస్తకములను రచించారు. హిందువుల పట్ల అతను

కలిగియున్న భారాన్ని బట్టి అనేక ప్రదేశాలకు ప్రయాణిస్తూ వారి మధ్య సువార్తను ప్రకటించారు.

జీవితాంతం దేవునికి ఎంతో నమ్మకముగా సేవ చేసిన నెహెమ్యా శాస్త్రి తన జీవితంలో ఎంతో మందిని

క్రీస్తు యొద్దకు నడిపించారు.


ప్రియమైన వారలారా, మీరు బైబిలు ధ్యానిస్తునపుడు, అది మీలో ఏ విధంగా పరివర్తన

తీసుకొని వస్తుంది?


““ప్రభువా, ప్రజలకు అర్థమయ్యే విధంగా సువార్తను ప్రకటించుటకు నాకు నేర్పించండి, ఆమేన్.”


No comments:

Post a Comment