రచయిత:
దక్షిణ రాజ్యం యూదాలో నివసించిన ప్రవక్త యోవేలు. ఈ పేరుకు అర్థం “యెహోవాయే దేవుడు”.
వ్రాసినకాలం:
సుమారు క్రీ.పూ.835.
ముఖ్యాంశం:
యెహోవా దేవుని భయంకరమైన దినం. ఇస్రాయేల్వారి పాపం మూలంగా దేవుడు వారిని అనతికాలంలోనే నాశనం చేస్తాడన్న హెచ్చరిక. మిడతల దండు రూపంలో ఆ వినాశనం వచ్చిపడి తీరని నష్టాన్ని కలిగిస్తుంది. “యెహోవా దినం” అనే భయంకరమైన తీర్పు దినానికి ఆ మిడతల గుంపులు తెచ్చే నాశనం ఒక సూచన. అయితే ఆ గొప్ప విపత్తునుండి దేవుడు ఇస్రాయేల్ ప్రజను కాపాడతాడనీ, వారిని బాధించినవారిని శిక్షిస్తాడని యోవేలు దేవుని మూలంగా తెలియజేశాడు. 2:28-29 లో దేవుని ఆత్మను గురించిన గొప్ప భవిష్యద్వాక్కు ఉంది.
విషయసూచిక:
ప్రవక్త పరిచయం 1:1
మిడతల గుంపులు కలిగించే వినాశనం 1:2-20
యెహోవా దినం తీసుకువచ్చే బాధ 2:1
ఇస్రాయేల్ పైకి దాడి చేయబోయే సైన్యాలు 2:2-10
పశ్చాత్తాపపడాలని పిలుపు 2:11-17
ప్రతిగా దేవుడు వారిని ఆదుకుని, ఆశీర్వదించడం 2:18-20
ఆనంద సమాచారం 2:21-24
రాబోయే దీవెనలు, ఆత్మ కుమ్మరింపు 2:25-32
ఇస్రాయేల్ను వేధించిన జనాలకు తీర్పు 3:3-16
ఇస్రాయేల్వారికి దీవెనలు కలుగుతాయన్న వాగ్దానం 3:17-21
No comments:
Post a Comment