Breaking

Wednesday, 6 April 2022

యూదా వ్రాసిన పత్రిక (పరిచయం)

 


రచయిత:

ప్రభువైన యేసు తమ్ముళ్ళలో ఒకడూ, యాకోబు సోదరుడూ అయినవాడు (మత్తయి 13:55; మార్కు 6:3). యేసు చనిపోయి సజీవంగా లేచిన తరువాత అతడు ఆయనమీదL నమ్మకముంచాడు.


వ్రాసినకాలం:

క్రీ.శ. 68-80 మధ్య కాలంలో.


ముఖ్యాంశం:

క్రీస్తు సంఘాలలో సత్యాన్ని త్రోసిపుచ్చి తప్పు సిద్ధాంతాలు నేర్పేవారిని గురించి రాశాడు. వారి ఉపదేశాన్ని, జీవిత విధానాన్ని కఠినంగా ఖండించాడు. ఈ లేఖలోని విశేషాంశం మూడో వచనంలో ఉంది – “పవిత్రులకు ఒక్క సారే అప్పగించబడ్డ విశ్వాస సత్యాలకోసం మీరు పోరాడాలి.


విషయసూచిక

యూదా ఈ లేఖ రాసిన కారణం 3,4 వచనాలు

పూర్వ కాలాల్లో దుర్మార్గులు 5-7 వచనాలు

ప్రస్తుతమున్న దుర్మార్గులు 8-19 వచనాలు

వారు మూర్ఖులు 10 వ వచనం

వారు ముగ్గురు వ్యక్తుల చెడు మార్గాలను అనుసరిస్తారు 10 వ వచనం

కొందరు సంఘాల నాయకులు 12 వ వచనం

వారి అంతం భయంకరం 13 వ వచనం

హనోకు వీరి గురించి చెప్పాడు 14,15 వచనాలు

క్రీస్తు రాయబారులు వీరిని గురించి హెచ్చరించారు 17,18 వచనాలు

విశ్వాసులు ప్రవర్తించవలసిన విధానం 20-23 వచనాలు

దీవెన 24,25 వచనాలు

No comments:

Post a Comment