రచయిత:
ప్రభువైన యేసు క్రీస్తు రాయబారి అయిన యోహాను.
వ్రాసిన కాలం:
బహుశా క్రీ.శ. 85-95 మధ్య కాలంలో.
ముఖ్యాంశం:
క్రీస్తు రాయబారి యోహాను తన ప్రియ మిత్రుడైన గాయస్కు ఈ లేఖ రాశాడు. ఈ చిన్న లేఖలో ముగ్గురు వ్యక్తులున్నారు – సత్యంలో నడుచుకొన్న గాయస్, తనను గొప్ప చేసుకొని క్రీస్తు రాయబారిని ఎదిరించిన దియొత్రిఫెస్, మంచి సాక్ష్యం పొందిన దేమేత్రియస్. ఈ లేఖలోని విశేషాంశం స్థానిక సంఘంలో తగిన ప్రవర్తన. విశ్వాసులు దియొత్రిఫెస్ చూపిన ప్రవర్తనకు దూరంగా ఉండి గాయస్, దేమేత్రియస్ చూపిన మాదిరిని అనుసరించాలి (11వ).
విషయసూచిక
గాయస్ – తన పనులతో తానొక విశ్వాసినని నిరూపించుకున్న మనిషి 1-8 వచనాలు
దియొత్రిఫెస్ – తన పనులతో తాను విశ్వాసి కాదని నిరూపించుకున్న మనిషి 9-11 వచనాలు
దేమేత్రియస్ – సత్యంవల్ల సాక్ష్యం పొందినవాడు 12 వ వచనం
No comments:
Post a Comment