Breaking

Tuesday, 5 April 2022

యోహాను వ్రాసిన రెండవ పత్రిక (పరిచయం)



రచయిత:

ప్రభువైన యేసు క్రీస్తు రాయబారి అయిన యోహాను.

వ్రాసిన కాలం:

బహుశా క్రీ.శ. 85-95 మధ్య కాలంలో.

ముఖ్యాంశం:

క్రీస్తు రాయబారి యోహాను “ఎన్నికైన అమ్మగారికి” రాశాడు. ఒక స్థానిక సంఘాన్ని ఉద్దేశించి అలంకారికంగా మాట్లాడుతున్నాడని కొందరి అభిప్రాయం. మరి కొందరేమో ఉన్నత స్థానంలో ఉన్న ఒక క్రైస్తవురాలిని ఉద్దేశించి రాస్తున్నాడంటారు. ఈ లేఖకు మూలపదాలు “సత్యం”, “ప్రేమ”. ఈ లేఖలో దుర్బోధకులను గురించి గంబీరమైన హెచ్చరిక ఉంది.

విషయసూచిక

ప్రేమలోనూ, సత్యంలోను నడవడం 1-6 వచనాలు

తప్పుడు బోధకుల గురించిన హెచ్చరికలు 7-11 వచనాలు

వారు యేసును గురించి సత్యాన్ని బోధించరు 7 వ వచనం

వారిని అనుసరించడం చాలా నష్టం 8 వ వచనం

క్రీస్తు బోధలను దాటి ఇంకెటో వెళతారు 9 వ వచనం

విశ్వాసులు వారితో పొంతన పెట్టుకోకూడదు 10-11 వచనాలు

ముగింపు మాటలు 12-13 వచనాలు

No comments:

Post a Comment