Breaking

Monday, 17 January 2022

హోషేయ (పరిచయం)

 




రచయిత:

బెరి కొడుకు హోషేయ.

వ్రాసిన కాలం:

సుమారు క్రీ.పూ. 800 (యెషయా 1:1 చూడండి).

ముఖ్యాంశం:

ఇస్రాయేల్ ప్రజలు సజీవుడైన నిజ దేవుణ్ణి విసర్జించి భయంకరమైన మత భ్రష్టత్వంలో పడిపోయారు. ఫలితంగా ప్రజలు వ్యక్తిగత, సామాజిక జీవనాలు దుర్మార్గపూరితం అయిపోయాయి. వారు పశ్చాత్తాపపడి ప్రేమామయుడైన తమ దేవుని వైపు తిరగాలని హోషేయ వివరించాడు. తన ప్రజలను విమోచించే దేవుని మహా ప్రేమను గురించి రాస్తూ, ఆయన విషయంలో ఇస్రాయేల్ జనం వ్యభిచారం చేసే భార్యలాంటిదని వివరించాడు. వారి ప్రవర్తన దేవునికి బాధ కలిగించిందని, అయినా ఆయన వారిని ప్రేమించడం మానలేదని, తనవైపుకు త్రిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని, ఆ ప్రయత్నం సఫలం అవుతుందని ఈ పుస్తకం సారాంశం.

విషయసూచిక:

హోషేయ భార్య, పిల్లలు 1:1-11

ఇస్రాయేల్‌వారి ద్రోహం 2:1-13

ఇస్రాయేల్‌వారికి పూర్వక్షేమస్థితి కలుగుతుందన్న వాగ్దానం 2:14-23

నమ్మక ద్రోహం చేసిన తన భార్యను హోషేయ తిరిగి తెచ్చుకోవడం 3:1-5

ఇస్రాయేల్‌వారి గురించి దేవుని ఫిర్యాదులు 4:1-19

యాజులకు, రాజుకు, ప్రజలకు హెచ్చరికలు 5:1-15

పశ్చాత్తాపానికి పిలుపు 6:1-3

ఇస్రాయేల్‌వారి గురించి దేవుని ఫిర్యాదులు 6:4-11

తిరుగుబాటు, వ్యభిచారం, తాగుబోతుతనం 7:1-16

ఇస్రాయేల్‌వారిపై తీర్పు 8:1—10:15

తుఫాను అనే పంట కోస్తారు 8:1-14

చెర, ప్రవాసం 9:1-17

తలవంపులు 10:1-15

పాపభరితులైన ఇస్రాయేల్‌ప్రజ పట్ల దేవుని ప్రేమ 11:1-11

ఇస్రాయేల్‌వారి అపరాధం, దేవుడు గతంలో వారికి చేసిన మేళ్ళు 11:12—12:14

ఇస్రాయేల్ ప్రజల నమ్మకద్రోహం, వారిపై దేవుని కోపం 13:1-16

పశ్చాత్తాపపడమని పిలుపు, దీవెనలనిస్తానన్న దేవుని వాగ్దానం 14:1-9

No comments:

Post a Comment