రచయిత:
యిర్మీయా.
వ్రాసిన కాలం:
క్రీ.పూ.586 తరువాత ఎప్పుడో ఒక సమయంలో వ్రాసి ఉండాలి.
ముఖ్యాంశం:
ఇది జెరుసలం విషయం శోకపూరిత పద్యం. ఇందులో జెరుసలం నాశనం, దానికి కారణం, యిర్మీయా మనోవేదనలు, అతడు నేర్చుకొన్న ఆధ్యాత్మిక పాఠాలు, ఇస్రాయేల్ ప్రజలకోసం అతని ప్రార్థన కనిపిస్తున్నవి. విలాపం, దుఃఖం మధ్యలో కొన్ని చక్కని అర్థ సహితమైన మాటలు ఈ పుస్తకంలో ఉన్నాయి – 3:21-27.
విషయ సూచిక
జెరుసలం పతన స్థితిని ప్రవక్త వివరిస్తున్నాడు 1:1-11
వ్యక్తితో పోల్చబడిన జెరుసలం తన స్థితిని గురించి విలపిస్తుంది 1:12-22
ప్రవక్త మరోసారి మాట్లాడుతున్నాడు 2:1-22
ప్రవక్త తన విలాపాన్ని ముందుకు సాగించాడు 3:1-20
బలమైన ఆశాకిరణాలు 3:21-42
అయినా దుఃఖం ఇంకా మిగిలి ఉంది 3:43-66
జెరుసలం గత వైభవం, ప్రస్తుత విషాద పరిస్థితి 4:1-22
జెరుసలం తరఫున దేవునితో మొరపెట్టడం 5:1-22
No comments:
Post a Comment