ఇస్సాకు భార్య రిబ్కా, ఆమె బహు సౌందర్యవతి. వినయ సంపన్ను రాలు. ఆ దంపతులకు ఏళావు, యాకోబు అను యిద్దరు కుమారులు కలిగారు
వారిలో యాకోబు చిన్నవాడు, యాకోబు అను మాటకు మోసగాడు అని అర్థము రిబ్కా గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె గర్భంలోని శిశువులు ఒకరితో ఒకరు పెనుగులాడుకోసాగారు. ఈ సంగతి గమనించిన రిబ్కా దేవుణ్ణి ప్రార్ధించింది దేవుడు ఆమెతో యిలా అన్నాడు. "నీ గర్భంలో రెండు జన పదాలున్నాయి ఒకదాని కంటే మరి యొకటి బలిష్టమైనదై ఎక్కువ వృద్ధి చెందుతుంది. పెద్దవాడు
చిన్నవానికి దాసుడౌతాడు. యాకోబు ఏశావు యొక్క మడమ పట్టుకొని పుట్టాడు. ఏశావు ఎర్రనివాడు. శరీరం అంతా రోమములు గలవాడు. అతడు అడవిలో సంచరిస్తూ జంతువులను వేటాడి జీవితం గడిపేవాడు. యాకోబు పశువులు మేపుతూ గుడారంలో నివసిస్తుండేవాడు. ఒకసారి ఏశావు బాగా ఆకలిగొని వచ్చాడు యింట్లో కలగూర వంటకం చేస్తున్న యాకోబును కొంత ఆహారం యిమ్మన్నాడు
ఆహారానికి బదులుగా యాకోబు తన అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని అడిగి తీసుకొన్నాడు యాకోబును తండ్రి దీవించుట ఇస్సాకు ముసలివాడయ్యాడు. అతనికి ఏళావుపై ప్రేమ ఎక్కువ అతడొక దినం ఏశావును పిలిచి, "నీవు ఒక జంతువును వేటాడి దాని మాంసం
వండి నాకొరకు తీసికొనిరా నేను నిన్ను ఆశీర్వదిస్తాను" అన్నాడు. ఈ సంగతి తెలిసిన రిబ్కా కూర తయారు చేసి యాకోబుకు యిచ్చి పంపింది. అతని చేతులకు, మెడపైన మేక చర్మము కప్పింది. ఆమెకు యాకోబు అంటే ఎక్కువ ప్రేమ
యాకోబు కూరతో తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నేను ఏశావును. నీకు మాంసం వండి తెచ్చాను. దేవుని దయవల్ల నాకు వెంటనే ఒక జంతువు దొరికింది అని చెప్పాడు. అతని మాటలు విన్న ఇస్సాకు యాకోబును తడిమి చూశాడు. "శరీరం ఏశావుది కాని స్వరం యాకోబుది" అన్నాడు. ఇస్సాకు యాకోబుు ఇలా దీవించాడు. "నా కుమారునిసునాసన యెహోవా చేని సునాసన వలె వున్నది దేవుడు నీకు ఆధికమైన ధాన్యమును ద్రాక్షారసమును యిస్తాడు. జనులు నీకు దాసులుగా వుంటారు. నీ బంధువులకు నివు రాజువై
వుంటావు. నిన్ను శపించే వాళ్ళు శపించబడతారు. నిన్నసు దీవించేవాళ్ళు దీవెనలు పాందుతారు"
యాకోబు వెళ్ళిపోయిన తర్వాత ఏశావు వచ్చాడు. యాకోబు తండ్రిని మోసం చేసి తాను పాందవలసిన దీవెనలన్సీ పొందాడని తెలిసికొన్నాడు. మనసులో చాలా బాధపడ్డాడు. ఒక్క దీవెన అయినా యివ్వమని తండ్రిని బ్రతిమిలాడాడు. అప్పుడు ఇస్సాకు "నీవు కత్తిచేత బ్రతుకుతావు. నీ నివాసము సారము లేనిదై వుంటుంది. నీవు నీ తమ్మునికి దాసుడుగ అవుతావు" అన్నాడు ఏశావు యాకోబుపై చాల కోపంగా వున్నాడు. ఈ సంగతి గ్రహించిన రిబ్కా యాకోబును పద్దనరాములో వుంటున్న తన సహోదరుడైన లాబాను వద్దకు పంపింది
యాకోబు తన మేనమామల వూరికి పారిపోతున్నాడు. ప్రొద్దు గ్రుంకింది. ఒకచోట ఆగాడు. ఒక రాతిని తలదిండుగా చేసికొని నిద్రపోయాడు
నిద్రలో ఒక కలగన్నాడు. ఆకలలో ఒక నిచ్చెన కనిపిస్తోంది. దాని కొన భూమిమీద వుంది. రెండవ కొన ఆకాశాన్ని తాకుతోంది. దేవదూతలు ఆ నిచ్చెన ఎక్కుతూ, దిగుతూ వున్నారు. నిచ్చెన పై భాగంలో దేవుడు వున్నాడు. ఆయన యాకోబుతో యిలా అన్నాడు. "నిన్ను విడువను ఎడబాయను, నీ సంతానాన్ని భూమి మీది యిసుక రేణువుల వలె
విస్తరింపచేస్తాను. భూమి మీద వంశములన్నీ నీ మూలంగా ఆశీర్వదింపబడతాయి. నేను నీకు తోడై వుంటాను. నీవు వెళ్ళే ప్రతి స్థలంలో ఆశీర్వదిస్తాను
విన్ను ఈ దేశానికి మరల రస్పిస్తాను" యాకోబుకు మెళకువ వచ్చింది. కలను గుర్తు చేసికొని చాల భయపడ్డాడు. ఈ స్థలము దేవుని మందిరము తప్ప వేరొకటి కాదు. యిది విజంగా పరలోకపు గవిని (ప్రవేశ ద్వారము) ఆనుకొన్నాడు. తాము తలగడగా చేసికొన్న రాతిని విలబెట్టి దానిపై నూనె పోశాడు ఆ
ప్లమునకు జేతేలు" (దేవుని మందిరము) అని పేరు పెట్టాడు. నేను క్షేమంగా నా తండ్రి యింటికి తిరగి వస్తే యెహోవాయే వాకు దేవుడుగా వుంటాడు,. ఈ
రాయి దేవుని మందిరం అవుతుంది. దేవుడు నాకిచ్చే సంపదలో దశమ భాగం దేవునికి అర్పిస్తాను. అని ప్రమాణం చేసి హారాను దేశంపైపు సాగిపోయాడు
హారాను దేశంలో లాబాను యింటిలో యాకోబు
యాకోబు తన మేనమామ లాబాను యింటికి వెళ్లాడు. అతని యింట్లో అన్ని పనులు చేస్తున్నాడు. లాబాను యాకోబుకు జీతం ఇస్తానన్నాడు. నాదగ్గర
ఏడు సరి॥లు పనిచేస్తే నా కుమార్తెను నీకుభార్యగా చేస్తానన్నాడు. లాబాను పెద్ద కుమార్తె లేయా, ఆమె జబ్బు కండ్లు కలది. చిన్న కుమార్తె రాహేలు చాలా
అందమైంది. యాకోబు రాహేలును ప్రేమించాడు. ఆమెను భార్యగా పొందడానికై మామ దగ్గర 7 సం॥లు పనిచేయడానికి సిద్ధదపడ్డాడు ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి లాబాను పెద్ద విందు చేయించాడు, రాత్రి సమయంలో తన పెద్దకుమార్తె అయిన లేయాను యాకోబు దగ్గరకు పంపాడు. ఉదయాన్నే మామచేసిన మోసం తెలిసికొన్నాడు. ఇలా ఎందుకు చేశావని మామను నిలదీశాడు. "పెద్ద అన్మాయికి వివాహం
చేయకుండా చిన్నమ్మాయికి చేయడం మాదేశపు మర్యాద కాదు, నీవు చిన్నమ్మాయి కావాలంటే మరో ఏడేండ్లు నా దగ్గర కొలువు చెయ్యి" అన్నాడు యాకోబు చాల దిగులుపడ్డాడు. అతను రాహేలును ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి మరో 7 సం॥లు మామయింట్లో కొలువు చేసి రాహేలును పెండ్లి
చేసికొన్నాడు. యాకోబు లేయాను ద్వేషించాడు, రాహేలును ప్రేమించాడు అయితే దేవుడు లేయాకు మొదట సంతానాన్ని యిచ్చాడు. ఆమెకు ఆరుగురు
కుమారులు, ఒక కుమార్తె పుట్టారు. వారి పేర్లు రూబేను, షిమ్యోను, లేవి యూదా, ఇళ్ాకారు, జెబులూను, కుమార్తె పేరు దీనా, లాభాను లేయాదాసి
అయిన జిల్పాను, రాహెలు దాసి అయిన బిల్హాను కూడా యాకోబుకు యిచ్చివేశాడు. జీల్పా కుమారులు గాదు, ఆషేరు, బిల్హా కుమారులు: దాను నప్తాలి
రాహేలుకు చాలా కాలం వరకు సంతానం లేదు, తర్వాత ఆమెకు యోసేపు అను కుమారుడు పుట్టాడు, మామ కోరికపై యాకోబు యింకా
ఆరు నెలలు కొలువు చేశాడు. ఈ సమయంలో పొడలు, చారలు వున్నమేకలను, నల్లని గొర్రెలను తన జీతంగా తీసికొంటానన్నాడు. ఆందుకు
లాబాను సమ్మతించాడు
యాకోబు పశువులు నీళ్లు తాగు చోట్లలో చారలున్న చీనారు జంగిసాలు చెట్ల చువ్వలను నాటాడు, ఆందువల్ల యాకోబు పశువులు అత్యధికంగా వృద్ధి చెందాయి. అతడు మిక్కిలి ధనవంతుడయ్యాడు. ఈ
విషయం తెలిసికొన్న లాబాను కొడుకులు అసూయపడ్డారు. లాభాను కూడ ముఖం చిన్నబుచ్చుకొన్నాడు. ఈ సంగతి గమనించిన యాకోబు తన యావదాస్తిని, భార్యలను, దాపదాసీలను పశువులను గొర్రెలను వెంటబెట్టుకొని
తన తండ్రి వుంటున్న కనాను దేశానికి బయలుదేరాడు.
యాకోబు తన అన్న ఏశావు వుంటున్న శేయీరు ప్రాంతం చేరాడు. ఏశావు తనను, తన భార్యాపిల్లలను చంపు తాడేమో అని మనసులో భయపడుతున్నాడు. అందుకని తన గుంపును రెండు భాగాలు చేశాడు.
మొదటి గుంపులోని సేవకులకు బహుమతులిచ్చి పంపాడు. తాను కొంతమందితో వెనకవుండిపోయాడు. ఒకవేళ ఏళావు కోపంతో మొదటి గుంపును చంపితే తాను వెనక నుండి పారిపోవచ్చు అనుకొన్నాడు. తన వెంట
వున్న బార్య, బిడ్డలను, దాస, దాసీలను కూడ రేవు దాటించాడు. తాను ఒంటరిగా మిగిలిపోయాడు. యాకోబు డేవునికి దీనంగా మొర పెట్టుకున్నాడు. "దేవా నీవు ఆజాపించిన విధంగానే నేను నా దేశానికి బంధుజనుల దగ్గరికి బయలుదేరాను. నీవునన్ను బహుగా ఆశీర్వదించి నా సంలానాన్ని యిసుక రేణువులవలె విస్తరింప చేస్తానని వాగ్దానాలు చేసి వుంటివి. నేను వట్టి చేతులతో హారానుదేశం వెళ్లాను. యిప్పుడు ఎంతో ఆశీర్వదింపబడి అపారమైన సంపదలతో భార్య బిడ్డలతో, దాసి డాసీలతో తిరిగి వస్తున్నాను. అయినను మా అన్న ఏశావుకు
భయపడుతున్నాను. నీవే నాకు దిక్కు" అని ప్రార్థించాడు. ఆ రాత్రంతా ఒంటరిగా వున్న యాకోటుతో ఒక నరుడు (నరుని రూపంలో వున్న దేవదూత) పెనగులాడాడు. యాకోబు అతన్ని గట్టిగా పట్టుకొని -"నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నేను నిన్ను పోనివ్వను" అన్నాడు అప్పుడు దేవదూత "నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి
గెలిచావు. కాబట్టి యిక నుండి నీ పేరు ఇశ్రాయేలు" (దేవునితో పోరాడువాడు)
అని అన్నాడు. యాకోబు దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన స్థలం గనుక ఆ చోటికి పెనూయేలు(దేవుని ముఖం) అని పేరు పెట్టాడు. అప్పుడు సూర్యోదయమైంది. దేవుడు యాకోబుతో పెనుగులాడుతున్న సమయంలో అతని తొడగూటిమీద కొట్టాడు. కనుక ఉదయం యాకోబు కుంటుతూ నడిచాడు. అతడు పెనూయేలు నుండి ముందుకు సాగిపోయాడు. దూరం నుండి వస్తున్న ఏశావును చూశాడు. అయినా ధైర్యంగా అందరికంటె ముందు నడుస్తున్నాడు. తన వెనుక భార్య, పిల్లలను, సేవకులను వుంచాడు ఏశావు తమ్ముణ్ణి సంతోషంగా ఎదుర్కొన్నాడు. ప్రేమతో కౌగిలించుకొన్నాడు. వీళ్ళంతా ఎవరు అని ఆడిగాడు. నాభార్య బిడ్డలు, దాస దాసీలు అని చెప్పాడు. యాకోబు తన భార్యల దగ్గర ఫున్న అన్యదేవతల విగ్రహాలను షెకెము దగ్గర వున్న మస్తకి వృక్షము క్రింద పాతిపెట్టాడు. తర్వాత
బేతేలుకు వెళ్లాడు. అక్కడ నుండి బెల్లెహేము (ఎప్రాతా) వెళ్లు మార్గంలో రాహేలు తన రెండవ కుమారుడు బెన్యామీమను ప్రసవించి మరణించింది
తర్వాత యాకోబు హెబ్రోను వెళ్ళి తన తండ్రియైన ఇప్పాకుతో కలిసి వుండసాగాడు
యాకోబుకు మొత్తం 12 మంది కుమారులు కలిగారు. వారిలో రాహేలుకు పుట్టిన యోసేపు, బెన్యామీను అంటే అతనికి చాల యిష్టము తక్కిన కుమారులు యోసేపును కొట్టి, ఐగుప్తు వెళ్లే ఇష్మాయేలీయులకు
అమ్మివేశారు. ఐగుప్తులో యోసేపు రాజు దయపొంది గొప్ప అధికారి అయ్యాడు కనానులో కరవు ఏర్పడిన సమయంలో యాకోబు తన కుమారులు, యితర
కుటుంబ సభ్యులందరితో ఐగుప్తుకు వెళ్లాడు. అక్కడ 17 సం॥లు వున్నాడు 14సం బ్రతికాడు. యాకోబు కోరిక మేరకు అతని మృత దేహాన్ని కనాను
దేశంలో మక్బేలా పొలంలోని గుహలో, అతని పితరుల సమాధుల దగ్గర పాతిపెట్టారు. ఆ పొలము అబ్రాహాము శమశానము కొరకై కొని వుంచినది
ధ్యానాంశములు :
1.యాకోబు క్రేస్తవ విశ్వాసికి సూచనగా వున్నాడు. మొదట మోసగాడుగా వున్నాడు. అయితే పెనూయేలు అనుభవం తర్వాత ఇశ్రాయేలుగా
మారిపోయాడు. అతనిలో యదార్థత, ధైర్యము, మంచి తనం వచ్చేశాయి
2.యాకోబు 12మంది కుమారులతో బహుగా ఆశీర్వదింపబడ్డాడు
యాకోబు కుమారుల పేర్లను బట్టియే ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రములుగా విభజింపబడ్డారు. ఉదా:- రూబెను గోత్రం, యూదా గోత్రం, గాదు గోత్రం
3.యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. అతని పేరును బట్టియే ఇశ్రాయేలు జనాంగము ఏర్పడింది. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎక్కువగా
ప్రేమించాడు
4.యాకోబు యెహోవా దేవుని పట్ల అధికభక్తి విశ్వాసాలు కలిగి వున్నాడు దేవుడు కూడ యాకోబును ఎక్కువ ప్రేమించి, ఆశీర్వదించాడు. కనుకనే ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి "యాకోబు దేవా" అని పిలిచేవారు
బంగారు వాక్యము
ఇశ్రాయేలు వంశము సైన్యముల కథిపతియగు యెహోవా ద్రాక్షతోట
యెషయా 5:7
No comments:
Post a Comment