దేవుడు ఈ భూమిపై సృష్టించిన మొట్టమొదటి మానవుడు ఆదాము. అతడే మానవ జాతికి మూల పురుషుడు. దేవుడు ఆరు రోజుల్లో భూమ్యాకాశాలను, సూర్య చంద్రులను, పశు పక్ష్యాదులను, మనిషిని సృజించాడు.
ఆ సృష్టి క్రమం యిలా వుంది.
మొదట భూమి నిరాకారంగా వుంది. అగాధజలములపై దట్టమైన చీకటి క్రమ్మి వుంది. దేవుని ఆత్మ ఆ జలముల పై అల్లాడుతూ వుంది. దేవుడు ఆజ్ఞ ఇయ్యగానే వెలుగు ఏర్పడింది. ఆయన మొదటి రోజు వెలుగును, చీకటిని వేరుపరచి వెలుగుకు పగలు అని, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. రెండవ రోజు దేవుడు అగాధ జలములను రెండు భాగములుగా చేశాడు. పై జలములకు
ఆకాశమని పేరు పెట్టాడు. మూడవ రోజు ఆకాశము క్రింద వున్న జలములన్ని ఒక చోట కూర్చబడి ఆరిన నేల కనిపించుగాక అని ఆజ్ఞాపించాడు. జలములు,
భూమి విడిపోయాయి. దేవుడు జలములకు సముద్రమని, ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. భూమిపై పలురకాల మొక్కలు, ఫలమిచ్చు వృక్షాలు, గడ్డి మొలచుగాక అని ఆజ్ఞ ఇచ్చాడు.
అంతా ఆయనమాట ప్రకారం జరిగింది.
నాల్గవ రోజు దేవుడు పగలును రాత్రిని వేరు చేశాడు. వాటిని సూచించుటకై రెండు గొప్ప జ్యోతులను నియమించాడు. పగలును ఏలుటకు సూర్యుణ్ణి,
రాత్రిని ఏలుటకు చంద్రుణ్ణి నక్షత్రాలను ఏర్పాటు చేశాడు. వీటన్నిటిని కాలములు, దినములు, సంవత్సరములను సూచించడానికి యేర్పాటు చేశాడు. అయిదవ రోజు దేవుడు ఆకాశంలో ఎగిరే పకులను, నీటిలో సంచరించే జలచరాలను సృజించాడు. ఆరవరోజు భూమి పై వుండే పశువులను, పురుగులను, అడవి జంతువులను సజించాడు. ఈ ఆరు రోజుల్లో తాను శృజించిన వాటన్నింటిని చూచి సంతోషించాడు. తర్వాత దేవుడు తన పోలిక చొప్పున, నరుని (మానవుణ్ణి) చేశాడు. సృష్టిలోని తక్కిన వస్తువులను,
జీవరాశులను దేవుడు తన నోటి మాటతో సృజించాడు. కాని మనిషిని మాత్రం
స్వయంగా తన చేతులతో, నేలమట్టితో తయారు చేశాడు. అతని నాసికారంధ్రములలో జీవ వాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. దేవుడు
నరుణ్ణి భూమి మీద వుండే సమస్తమైన జంతువులు, వృక్షములు, యితర జీవరాసులకంటె శ్రేష్టమైన వానిగా సృజించాడు. అతనికి భూమిపై వుండే పక్షులు,
జంతువులు, యితర జీవరాసులు, పండ్లు, ధాన్యములు ఆహారంగా వుండుగాక అని ఆజ్ఞాపించాడు.
దేవుడు ఏడవ రోజు విశ్రాంతి తీసికొన్నాడు. ఆయన ఏడవ రోజును పరిశుద్ధ పరచి, ఆశీర్వదించాడు.
దేవుడు సృజించిన మొట్ట మొదటి నరుని పేరు ఆదాము. దేవుడు ఆదామును ఏదెను తోటలో వుంచాడు. ఆదామునకు కష్టపడి వ్యవసాయం
చేయాల్సిన అవసరం లేదు. ఆవిరి భూమిలో నుండి పైకి వచ్చి నేలను తడుపుతూ వుండేది.
ఏదెను తోట మధ్యలో 1. జీవ వృక్షము. 2. మంచి చెడ్డలు తెలిపే వృక్షము వున్నాయి. దేవుడు ఆదాముకు ఒక గట్టి హెచ్చరిక చేశాడు. “నీవు |
ఈ తోటలోని పండ్లన్నీ తినవచ్చు. అయితే మంచి చెడ్డలు తెలిపే వృక్షము యొక్క పండ్లు మాత్రం తినకూడదు. అవి తింటే తప్పకుండా చచ్చిపోతావు".
ఆదాముకు ఆకలి, దప్పిక, బాధ, చింత, సిగ్గు, బిడియం అనేవి ఏవీ తెలియవు. ప్రతిరోజు ఒక స్నేహితునితో మాట్లాడినట్లు దేవునితో మాట్లాడుతూ, కాలం గడుపుతున్నాడు.
'ఏదెను తోటలో తడపడానికి దేవుడు నాలుగు నదులను ప్రవహింప చేశాడు. వాటి పేర్లు పీషోను, గీహోను, హిద్దికెలు, ఫరాతు (యూఫ్రటీసు). ఆదాము
భూమిపై వున్న ప్రతి జంతువుకు, పక్షికీ, కీటకానికి పేర్లు పెట్టాడు. ఆదాము పెట్టిన పేర్లే వాటికి స్థిరపడిపోయాయి. కొంతకాలం గడిచి పోయింది. సృష్టిలోని జీవరాసులన్నీ జంటలుగా వున్నవి. ఆదాము మాత్రం ఒంటరిగా ఏదెను తోటలో
సంచరిస్తూ వున్నాడు. అతనికి ఎవరూ తోడులేరు. ఈ లోటును. దేవుడు గమనించాడు. ఆయన ఒక రోజు ఆదాముకు గాఢనిద్ర కలుగజేశాడు. అతని ప్రక్కటెముకను తీసి దాని నుండి ఒక స్త్రీని తయారు చేశాడు. ఆమెను ఆదాము దగ్గరికి తీసికొని వచ్చాడు. ఆ స్త్రీని చూచి ఆదాము చాల సంతోషించాడు. “నా యెముకలలో ఒక యెముక, నా మాంసములో మాంసము. ఈమె నరునిలో నుండి తీయబడింది కనుక “నారి” అని పిలువబడుతుంది” అన్నాడు. ఆదాము తన భార్యను చాలా ప్రేమగా చూసుకొంటున్నాడు. యిద్దరూ ఏదెను తోటలో దిగంబరులుగా సంచరిస్తూ, ఆ తోటలోని పండ్లు తింటూ కాలం గడుపుతున్నారు. వారికి సిగ్గంటే ఏమిటో తెలియదు. వారు పరిశుద్ధులై,
దేవునికి ఇష్టులై వున్నారు.
దేవుడు సృజించిన భూ జంతువులలో సర్వము (సాతాను) చాల యుక్తి గలది. అది ఒక రోజు స్త్రీ (హవ్వ) దగ్గరికి వచ్చింది. ఆమెతో మాట్లాడుతూ “ఈ తోట చాలా అందంగా వుంది. తోటలోని పండ్లు చాల
బాగున్నాయి. మీరు ఈ పండ్లన్నీ తినవచ్చునా? ఏ చెట్టు పండైన తినకూడదని దేవుడు మీతో చెప్పాడా?” అని అడిగాడు.
స్త్రీ సర్పముతో తో యిలా అన్నది. “దేవుడు మాకు పూర్తి స్వేచ్చ యిచ్చాడు. ఈ తోటలోని పండ్లన్నీ తినవచ్చని చెప్పాడు. అయితే తోట మధ్యలో -
మంచి చెడు తెలిపే చెట్టు పండ్లు మాత్రం తినవద్దని చెప్పాడు. అవి తింటే చచ్చిపోతామని చెప్పాడు."
స్త్రీ మాటలు విన్న సర్పము నవ్వింది..
“అంతా అబద్దము. దేవుడు చెప్పిన మాటలు నమ్మకండి. ఆ చెట్టు పండ్లు తింటే మీరు చావనే చావరు. మీకు తెలివి వచ్చి మంచి చెడలు
తెలిసికొంటారు. మీరు దేవతలతో సమానులౌతారు. అందుకే దేవుడు మీతో ఆ పండ్లు తినవద్దని చెప్పాడు." అన్నది. స్త్రీ సర్పము మాటలు నమ్మింది. ఆ చెట్టు పండ్లు చూడటానికి చాల అందంగా, తినడానికి చాల రుచిగా వున్నాయి. గనుక ఆ స్త్రీ తాను కొన్ని పండ్లు తిని, తన భర్త అయిన ఆదాముకు కొన్ని యిచ్చింది. అవి తినిన వెంటనే వాళ్లు తాము దిగంబరంగా వున్నామని గ్రహించారు. అంజూరపు
ఆకులు కుట్టి తమ నడుములకు చుట్టుకొన్నారు.
సాయంకాలం అయింది. దేవుడు ఏదెను తోటలోనికి
వచ్చాడు. ఆదాము హవ్వలను పిలిచాడు. వాళ్ళు ఆయన స్వరం విన్నారు. ఆయన ఎదుటికి రాకుండా చెట్ల మధ్య దాక్కొన్నారు. ఏదో కీడు జరిగిందని
యెహోవా దేవుడు తెలిసికొన్నాడు. “ఆదామా! నీవు ఎక్కడ వున్నావు?” అని బిగ్గరగా పిలిచాడు. అందుకు జవాబుగా ఆదాము - నేను దిగంబరంగా వున్నాను.
కనుక చెట్ల చాటున దాక్కొన్నాను" అని చెప్పాడు..
“నీవు దిగంబరివని నీకెలా తెలిసింది? నేను తినవద్దని ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలను తిన్నారు కదూ?” అని అడిగాడు. అందుకు ఆదాము "ఈ స్త్రీ తాను తిని నాకు కూడ తినిపించింది.
అన్నాడు. స్త్రీ "సాతాను (సర్పము) మోసపు మాటలు నమ్మి తిన్నాను". అని చెప్పింది. ఈ విధంగా ఆదాము హవ్వ మీద, హవ్వ సర్పం మీద నెపం మోపారు
దేవుడు ఆదాము హవ్వలను బయటికి పంపుట.3
వారి మాటలు విన్న దేవునికి కోపం వచ్చింది. ఆయన సర్పాన్ని శపించాడు." ఈ చెడ్డ పని చేసినందువల్ల నీవు భూమి మీద వున్న జంతువులన్నింటిలో శపించబడిన దానివయ్యావు. నీవు పొట్టతో పాకుతూ
మట్టితిని జీవిస్తావు. నీ సంతానానికి, స్త్రీ సంతానానికి యుగ యుగాలు వైరం వుంటుంది. నీవు ఆమె సంతానాన్ని మడమమీద కరుస్తావు. ఆమె సంతానం
నిన్ను తలమీద కొడుతుంది" దేవుడు స్త్రీతో యిలా అన్నాడు. "నీవెంతో ప్రయాసతో ప్రసవ వేదన
భరించి పిల్లలను కంటావు, పురుషునిపై నీకు వాంఛ కలుగుతుంది. దేవుడు ఆదాముతో యిలా అన్నాడు. "నీవు నా ఆజ్ఞను అతిక్రమించావు. చేయరాని పాపం చేశావు. నీ మూలంగా ఈ భూపి శపించబడింది. నీవెంతో కష్టపడి, చెమటకార్చి ఆహారం పండించుకొ
తింటావు. నీవు నేలమట్టి నుండి తీయబడ్డావు కనుక నేలమట్టిలో" కలిసిపోతావు ఆదాము తన భార్యకు హవ్య (జీవముగల ప్రతి వానికి తల్లి) అని
పేరు పెట్టాడు. దేవుడు ఆదాము హమ్యలను ఏదెను తోట నుండి బయటికి పంపి వేశాడు. వాళ్లు తిరిగి రాకుండా తన దూతలైన కెరూబులను, జీవ వృక్షానికి
పోవు మార్గంలో అగ్ని జ్వాలలను కావలిగా పెట్టాడు
ఆదాము హవ్వలకు యిద్దరు కుమారులు కలిగారు. పెద్దవాడి పేరు కయీను, చిన్నవాడి పేరు హేబెలు. కయను వ్యవసాయదారుడు, , హేచెలు
గొర్రెల కాపరి, కయీను అసూయతో తన తమ్ముడైన హేబెలును చంపాడు. దేవుడు కయీనును దేశ దిమ్మరివి కమ్మని శపించాడు.
ఆదాముకు మరియొక కుమారుడు కలిగాడు. హవ్య అతనికి "షేతు అని పేరు పెట్టింది. ఆదాము 930 సం॥|లు జీవించాడు. ఆదాము హవ్యలు
దేవుని ఆజ్ఞ మీరడం వల్లనే మనుష్యులు క్రమక్రమంగా దేవునికి దూరస్థులై సాతాను బంధకములలో చిక్కుకొన్నారు. సాతాను యొక్క బానిసత్వం నుండి
మానవులను విమోచించడానికి దేవుడు నరరుూప ధారియై యేసుక్రీస్తుగా జన్మించాడు
ధ్యానాంశములు
మీరడం వల్లనే మనుషులు క్రమక్రమంగా దేవునికి దూరస్థులై ఆదాము పొవ్వ దేవుని సన్నిధిలో, ఏదైను వనంలో హాయిగా, పవిత్రంగా జీవితం గడుపుతున్నారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల శాపాన్ని కష్టాలను కొని తెచ్చుకొన్నారు
1.తాము చేసిన తప్పుకు యితరులు కారణం అని చెప్పారు. తమ తప్పును ఒప్పుకోలేదు
మనుషులు చిరకాలం శాపంలో, పాపంలో వుండటం దేవునికి యిష్టంలేదు ఆదాము పొవ్వలు జీవ వృక్ష ఫలాలు తింటే చిరకాలం పాపంలోనే వుండి పోవలసి వచ్చేది. అందుకే దేవుడు వాళ్ళను ఏదెను తోటలో
నుండి బయటికి పంపివేశాడు
3.దేవుడు ప్రేమా స్వరూపి, కనుకనే శరీర ధారిగా భూమిపై అవతరించాడు సాతాను చాలా యుక్తిగా మాట్లాడుతాడు. మోసం చేస్తాడు. కనుక విశ్వాసులు చాలా జాగ్రత్తగా వుండాలి
బoగారు వాక్యము
మనము మట్టినుండి పుట్టిన వాని పోలిక ధరించిన ప్రకారము, పరలోక పంబంధి పోలికయు ధరింతుము" 1 కొరింధి 15:49
No comments:
Post a Comment