Breaking

Saturday, 30 November 2019

Bible story of Gideon | bible stories in telugu | గిద్యోను


ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దృష్టిలో చెడిపోయారు. వారు దేవున్ని ఆయన చేసిన ఉపకారాలను మరచిపోయి అన్యదేవతలను పూజింపసాగారు.
వారితో వివాహసంబంధాలు ఏర్పరచుకొన్నారు. అందువల్ల దేవుడు వారిని 7 సం|లపాటు మిద్యానీయులకు అప్పగించాడు. మిద్యానీయులు మిడుతల దండువలె దండెత్తి ఇశ్రాయేలు వారి పంటలు నాశనం చేస్తున్నారు. పశువులను
చంపుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు పారిపోయి కొండలను, వాగులను, గుహలను, పాత దుర్గములకు తమ ఆవాసాలుగా చేసికొన్నారు. వారు చాల
కష్టాలలోవున్నారు. తమ కష్టాలు పొగొట్టమని యెహోవాకు దీనంగా మొరపెట్టుకొన్నారు. ఆయన వాళ్ల మొర విన్నాడు. యెహోవా (దూత) యోవాషు కుమారుడైన గిద్యోనుకు గానుక చాటున, మస్తకి వృక్షం క్రింద ప్రత్యక్షమయ్యాడు. "నీవు బలము తెచ్చుకొనుము. ఇశ్రాయేలు ప్రజలను మిద్యానీయుల చేతిలోనుండి విడిపించుము. యెహోవా నీకు తోడై వుంటాడు" అని చెప్పాడు. గిద్యోను మొదట సందేహించాడు. శతృవులు బలవంతులు. వాళ్ళను ఎదిరించడానికి తన బలము, ఇశ్రాయేలీయుల బలము చాలవన్నాడు. అయితే ఆ దూత - "నేను నీకు తోడుగా వుంటాను. ఒక మనిషిని చంపినంత సులభంగా నీవు మిద్యాను సైన్యాన్ని సంహరిస్తావు" అన్నాడు. యెహోవా (దూత) గిద్యోను అర్పించిన మేక పిల్ల మాంసమును పొంగని భక్ష్యములను స్వీకరించాడు. యెహోవా ఆదేశం ప్రకారం గిద్యోను రాత్రివేళ బయలుదేవత బలిపీఠాన్ని పడగొట్టి, దేవతా స్తంభాన్ని విరుగ గొట్టాడు. ఉదయాన్నే ఊరి
వారందరు గుమికూడారు. గిద్యోను బయలు దేవతను అవమానించాడు కనుక అతన్ని చంపి తీరాలని పట్టుపట్టాడు. కాని యోవాసు "గిద్యోను సంగతి'
బయలు దేవత చూసుకొంటుంది" అన్నాడు. యోవామ గిద్యోనుకు యేరుబ్బయలు" అని పేరు పెట్టాడు.

ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయడానికి మిద్యనీయులు అమాలేకియులు ఏకమయ్యారు. మీవో వా అత్మగిద్యోనులో ప్రవేశించింది. అతడు బూరను ఊదగానే ఇతాయేలు ప్రజలంతా గుమికూడారు. యుద్దం చేయబోయేముందు గిద్యోను తమ పక్షానికి విజయం లభిస్తుందో లేదో తెలిసికోవాలని అనుకొన్నాడు. అతడు యెహోవాను ఈ విధంగా ప్రార్ధించాడు. దేవా, నేను కళ్లంలో ఒక చోట గొరెజొచ్చు ఉంచుతాను. నేలంతా పొడిగా ఉండి గొర్రె బొచ్చు మాత్రం మంచుతో తడవాలి. ఆప్పుడు నీవు మాకు విజయం చెకూరుస్తానని నమ్ముతాను.  గిద్యోను కోరిన విధంగా గొర్రెబొచ్చు మాత్రమే తడిసింది. రెండవసారి గిద్యోను చుట్టూవున్న నేలంతా తడిసి గొర్రె బొచ్చు మాత్రమే తడవకూడదు" అని ప్రార్ధించాడు. ఆ రాత్రి దేవుడు గిద్యోను కోరిన విదంగానే చేశాడు. ఈ రెండు సూచక క్రియలు చూసిన గిద్యోనుకు, ఆతని సైన్యానికి తమకే విజయం లభిస్తుందనే గట్టి నమ్మకం ఏర్పడింది. గిద్యోను మిద్యానీయులతో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. ఆప్పుడు యెహోవా " నీ సైనికులు ఎక్కువ మంది వున్నారు. మీరు గనక గెలిప్తే
మీ పైనిక బలం చేత గెలిచామని గర్విస్తారు. కాబట్టి  యుద్ధమంటే భయపడేవారిని యిండ్లకు పంపివేయి"
గిద్యోను ఈ సంగతి తెలియజేయగానే యిరవై వేలమంది వెళ్లిపోయారు. పదివేలమంది మిగిలారు. యెహోవా ఆదేశం మేరకు గిద్యోను వాళ్లందరిని నీళ్ల దగ్గరికి తీసికొని వెళ్లాడు. కుక్క గతికి నట్లు నీటిని గతికిన (తాగిన) మూడు వందల మందిని మాత్రం ఎంపిక చేశాడు. తక్కిన వారిని అన్నాడు ఇండ్లకు పంపివేశాడు గిద్యోను రహస్యంగా శతృసవుల శిభిరం దగ్గరికి వెళ్లాడు. అక్కడ యిద్దరు సైనికులు మాట్లాడుకోవడం విన్నాడు. "నిన్న రాత్రి నేనొక కలగన్నాను. ఒక యవలరొట్టె మిద్యానీయుల దండులోనికి దొర్లివచ్చింది. ఆది గుడారాన్ని పడగొట్టి
తలక్రిందులు చేసేంది" అని ఒక సైనికుడు అన్నాడు. "ఆ రొట్టె మరొకటి కాదు. గిద్యోను ఖడ్గమే. దేవుడు మన సైన్యాన్ని అతని చేతికి అప్పగించబోతున్నాడు" అని రెండవ సైనికుడు అన్నాడు. చాటున వుండి వారి మాటలు వినిన గిద్యోను మనసులోనే యెహోవాకు ధన్యవాదములు అర్పించాడు.

గిద్యోను తాను ఎన్నిక చేసికొని సిద్ధంగా వుంచిన 300 మంది సైనికులను మూడు భాగాలుగా విభజించాడు. వారిలో ప్రతి ఒక్కరికి ఒక బూరను, ఒక దివిటీని, ఒక ఖాళీ కుండను యిచ్చాడు. వారిని శత్రుసైన్యానికి
మూడు వైపుల వుండమన్నాడు. ఎప్పుడు ఏమి చేయాలో వివరించాడు. గిద్యోను చెప్పిన విధంగానే అతని సైనికులు చేశారు. వారు పెద్దగా బూరలు ఊదుచూ కేకలు వేసి కుండలు పగులగొట్టారు. తమ కుడి చేతుల్లో బూరలను, ఎడమ చేతిలో దివిటీలను పట్టుకొన్నారు. పెద్దగా బూరలు ఊదుచు యెహోవాకు గిద్యోనుకు జయము అని కేకలు వేశారు. ఇశ్రాయేలు సైన్యము తమ శిబిరాన్ని చుట్టుముట్టిందనుకొని శతృవులు భయపడి పారిపోయారు. వారు కలవరపాటుతో తమను తామే చంపుకొన్నారు. ఎఫ్రాయీము వారు మిద్యానీయులను తరిమివేసి, వారి రాజులైన ఓరేబు, జెయేబు అనువారిని చంపి, వారి తలలను గిద్యోను దగ్గరికి తీసికొని ప్రతీకారము వచ్చారు. గిద్యోను, అతని 300 మంది సైనికులు పారిపోతున్న మిద్యాను సైనికులను తరుముతున్నారు. వారు అలసిపోయి బాగా ఆకలిగొన్నారు. గిద్యోను తమ సైనికులకు అహారం పెట్టమని నుక్కోతు వారిని, పెనూయేలు వారిని
అడిగాడు, వారు అతని అభ్యర్థనను తిరస్కరించారు. గిద్యోను 17వేల సైనికులను చంపాడు. తన కోరికను తిరస్కరించినందుకు సుక్కోతులోని మంది పెద్దలకు బొమ్మజెముడుతో, నూర్చుకొయ్యులతో బుద్ధి చెప్పాడు. పెనూయేలులో రాజులైన బెరహు, సల్మన్నాలు గిద్యోను సహోదరులను చంపియుండిరి. దానికి ప్రతీకారంగా గిద్యోను వారిద్దరిని సంహరించాడు. ఇశ్రాయేలు ప్రజలు గిద్యోనును తమకు రాజుగా వుండమని కోరారు. కాని గిద్యోను "నేనుగాని, నా కుమారులు గాని మిమ్ములను పరిపాలింపము యెహోవాయే మిమ్ములను పరిపాలిస్తాడు" అన్నాడు. ఇత్రాయేలు సైన్యము
దోచుకొని తెచ్చిన ఆభరణములలో చెవిపోగులను మాత్రం స్వీకరించాడు. వాటి బరువు 1700 తులములు. ఆ బంగారంతో గిద్యోను ఒక ఎఫోదును చేయించుకొని, దానిని తన స్వంత పట్టణమైన ఒఫ్రాలో వుంచాడు. మిద్యానీయులు చాలా కాలం ఇశ్రాయేలీయులకు అణగి వున్నారు. 40సం|| లు దేశంలో శాంతి వ్యాపించి వుంది. గిద్యోనుకు చాలా మంది భార్యలు డెబ్బదిమంది కుమారులు ఉన్నారు. అతడు చాల వృద్దుడై, మరణించాడు


ధ్యానాంశములు

1.గిద్యోను ఒక సాధారణ వ్యక్తి, దేవుడు అతనిని ఏర్పరచుకొన్నాడు. అతని చేత గొప్ప కార్యాలు చేయించాడు

2.గిద్యోను దేవునికీ విధేయుడై పున్నాడు. ఆయన చెప్పిన విధంగా చేశాడు కనుకనే శత్రువులపై విజయం సాధించాడు.

3.దేవుడు ఏర్పరచుకొన్నవారు గొప్ప పనులు చేస్తారు. నూతన బలము పొందుతారు.

4.తనను ప్రేమించి, తనయందు భయభక్తులు గల వారికి దేవుడు తోడుగా వుంటాడు.

5.మనం కూడ దేవుని యందు భయభక్తులు గలిగి వుండాలి.


బంగారు వాక్యము

అపత్యాలమున నీవు వన్ను గూర్చి మొర సెట్టుము. నేను నిన్ను విడిపించెదను. నీవు నిన్ను మహిమపరచెదవు.
 కీర్తనలు 5015

No comments:

Post a Comment