Breaking

Saturday, 19 March 2022

తెస్సలొనీకయులకు వ్రాసిన రెండవ పత్రిక  (పరిచయం)

 



రచయిత:

ప్రభువైన యేసు క్రీస్తు రాయబారి పౌలు.


వ్రాసిన కాలం:

క్రీ.శ. 50-54 మధ్య కాలంలో.


ముఖ్యాంశం:

మొదటి లేఖలాగే ఈ లేఖ ముఖ్యాంశం క్రీస్తు రెండో రాకడ. ఈ సంఘం హింసలకూ కడగండ్లకూ గురి అయిన సమయంలో కొందరు దుర్బోధ చేసి ప్రభు దినం అప్పటికే వచ్చిందంటూ వారిని కలవరపెట్టారు (2:1-2). ప్రభు దినం అంటే ఆయన మహా కోప దినం, అవిశ్వాసులను దండించే దినం. ఆ దినం రాకముందు ‘న్యాయ విరోధి’ అనే పాపిష్ఠి మనిషి ప్రత్యక్షం కావాలని పౌలు రాశాడు. ఈ ‘న్యాయ విరోధి’ యుగ సమాప్తిలో రాబోయే క్రీస్తు విరోధి. 1 యోహాను 2:18; ప్రకటన 13వ అధ్యాయం; మత్తయి 24:15-24 చూడండి. ఈ తెస్సలొనీక విశ్వాసులు భయపడకుండా క్రీస్తును గురించిన సత్యాన్ని గట్టిగా చేపట్టాలని ఉద్బోధిస్తూ పౌలు వారిని ఓదార్చాడు.


విషయసూచిక

హింసలమధ్య పెరుగుతున్న ప్రేమ, విశ్వాసం 1:3-5

హింసించేవారికి, అవిధేయులకు శిక్ష 1:6-9

క్రీస్తుకు తన ప్రజలలో మహిమ కలుగుతుంది 1:10

వారి కోసం పౌలు ప్రార్థన, దానికి కారణం 1:11-12

క్రీస్తు రాకడ 2:1-2

క్రీస్తు విరోధి రాకడ 2:3-8

క్రీస్తు న్యాయ విరోధిని నాశనం చేస్తాడు 2:8

క్రీస్తు విరోధి ప్రజలను మోసం చేయగలగడానికి కారణం 2:9-12

వింతలు, సూచనలు, అద్భుతాలు 2:9-10

సత్యంపట్ల ప్రేమ లేకపోవడం 2:10

దేవుడు వారిని మోసగించే ప్రభావంతో శిక్షిస్తాడు 2:11-12

ప్రభువైన క్రీస్తు ప్రేమకు పాత్రులై,

దేవుని ఆత్మచేత పవిత్రులై, శుభవార్తద్వారా పిలుపు అందినవారు 2:13-14

నిలకడగా ఉండడం 2:15-17

ప్రార్థన, విన్నపం 3:1-2

పౌలు ప్రార్థన, నమ్మకం 3:3-5

సోమరితనానికి వ్యతిరేకంగా హెచ్చరిక 3:6-15

పౌలు ఉదాహరణ 3:7-9

ముగింపు మాటలు 3:16-18

No comments:

Post a Comment