Breaking

Thursday, 31 March 2022

పేతురు వ్రాసిన రెండవ పత్రిక ( పరిచయం )

 



రచయిత:

ప్రభువైన యేసు క్రీస్తు రాయబారి అయిన పేతురు.


వ్రాసిన కాలం:

క్రీ.శ. దాదాపు 67లో.


ముఖ్యాంశం:

క్రీస్తు రాయబారి పేతురు చనిపోబోతూ ఉన్నాడు (1:13-15). చనిపోకముందు విశ్వాసులు నేర్చుకొన్న విషయాలు వారికి జ్ఞాపకం చేసి ప్రోత్సహించాలని అతని ఉద్దేశం (1:14; 3:1). ఈ లేఖ ముఖ్యాంశం రాబోయే దుర్భోధకులు, వారి అవిశ్వాసం, తప్పు సిద్ధాంతాలు. విశ్వాసులు జాగ్రత్తగా ఉండి, క్రీస్తు బయలుపరచిన దివ్య సత్యాలు గట్టిగా చేపట్టాలనీ ఆధ్యాత్మిక జీవిత విషయాలలో పెరగాలనీ పేతురు వారిని హెచ్చరిస్తూ ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు.



విషయసూచిక

ఈ లేఖ ఎవరికి రాశాడో వారు 1:1-2

దేవుడు ఏమిచ్చాడు? ఎందుకిచ్చాడు? 1:3-4

మనం విముక్తి పొందామని ఖచ్చితంగా తెలుసుకోవడం ఎలా?

ప్రభువులో ఫలిస్తూ పరలోకంలో స్వాగతాన్ని పొందడం ఎలా? 1:5-11

జ్ఞాపకం చేసుకోవడంలోని ప్రాముఖ్యత 1:12-15

క్రీస్తు మహిమను ఆయన రాయబారులు కండ్లారా చూచిన సాక్ష్యం 1:16-18

బైబిలు లోని భవిష్యద్వాక్కు 1:19-21

నిజమైనది, నిశ్చయమైనది 1:19

మనం దాన్ని పట్టించుకోవాలి 1:19

చీకటిలో వెలుగు 1:19

దేవుని సహాయం లేకుండా ఇది అర్థం కాదు 1:20

దేవుడే ఇచ్చాడు 1:21

దుర్బోధకులు, వారి అంతం 2:1-22

వారి బోధలు 2:1-3

దుష్టులను దేవుడు శిక్షిస్తాడు 2:4-10

దుర్బోధకులు ఎలా ఉంటారు 2:10-22

ప్రభువు దినం 3:1-18

ఏమీ తెలియని పరిహాసకులు 3:3-7

దేవుని రోజులు మనుషుల రోజుల్లాంటివి కావు 3:8-9

ఆకస్మిక సంఘటన 3:10

దేవుని పిల్లలు ఎలా జీవించాలి 3:11-14

పౌలు లేఖలు 3:15-16

జాగ్రత్తగా ఉండి పెరుగుతూ ఉండండి 3:17-18

No comments:

Post a Comment