రచయిత:
హిజ్కియారాజు సంతతివాడైన జెఫన్యా ప్రవక్త.
వ్రాసినకాలం:
ఇతడు యోషియారాజు పరిపాలన కాలంలో (క్రీ. పూ. 640-609) భవిష్యద్వాక్కులు పలికాడు. బహుశా యిర్మీయా, నహూము, హబక్కూకుల సమకాలీకుడై ఉండవచ్చు. జెఫన్యా పరిచర్య తరువాతి రోజుల్లో యోషీయారాజు తన సంస్కరణలు చేపట్టి ఉంటాడు.
ముఖ్యాంశాలు:
యెహోవా దినం గురించిన వివరాలు. ఇస్రాయేల్వారు తమ అసహ్య ప్రవర్తనను గుర్తించి పశ్చాత్తాపపడాలని, లేకుంటే శిక్ష తప్పదని ప్రవక్త హెచ్చరించాడు. చివరి రోజుల్లో వారిపై దేవుడు కురిపించబోయే ఆశీస్సులను కూడా వర్ణించాడు.
విషయసూచిక:
ప్రవక్త పరిచయం 1:1
యూదాపైనా, లోకమంతటిపైనా విరుచుకుపడబోయే దేవుని తీర్పు 1:2-6
యెహోవా దినాన జరిగే నాశనకాండ 1:7-18
శిక్ష రాకముందే దేవునివైపుకు తిరగాలని పిలుపు 2:1-3
ఇరుగుపొరుగు జాతులపైకి రానున్న శిక్ష 2:4-15
ఫిలిష్తీయవారికి శిక్ష 2:4-7
మోయాబు, అమ్మోనువారికి శిక్ష 2:8-11
కూషువారికి శిక్ష 2:12
అష్షూరువారికి శిక్ష 2:13-15
జెరుసలంలో జరుగుతున్న అక్రమాలకు శిక్ష 3:1-5
ఇతర జనాలపై రానున్న దేవుని శిక్ష 3:6-9
చెదిరిపోయిన యూదులు తిరిగి వచ్చాక వారి క్షేమస్థితి 3:10-13
యూదులకు కలగబోయే దీవెనలు 3:14-20
No comments:
Post a Comment