నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.
యెషయా 43: 1
ప్రియులారా దేవుడు తన ప్రాణము పెట్టి మనలను పాపము నుండి విమోచించి యున్నాడు. మనం ఇప్పుడు దేనికిని భయపడకూడదు మనం మరణాన్ని జయించి ఆయన రక్తము ద్వారా నిత్య రాజ్యానికి వారసులమై యున్నాము అందుకె మనం ఏ విషయామును గురించి కూడా భయపడకూడదు.
ఆయన మనలను పేరు పెట్టి పిలిచియున్నాడు మనం ఆయన సొత్తైన ప్రజలము మనం బలవంతుడైన ఆయన చేతిలో ఉన్నాము గనుక ఏదియు మనకి ఏ హాని చేయజాలదు అంత గొప్ప దేవుని రక్షణ మనకు తోడైయుండి మనం దేనికి గురించి చింతించకూడదు.
దేవుడు ఈ విదంగా అంటున్నాడు.
నేను నీకు తోడై యున్నాను భయపడకుము నేను ని దేవుడనై యున్నాను దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని.
ప్రియులారా ఆయన మనకి సహాయకుడై యుండగా మన చింత యావత్తు ఆయన పై మోపి నిబ్బరం గలవారమై జీవిద్దాం. ఈ వాక్యం మనలను దేవుడే రక్షించు వాడై ఉన్నాడు మనం ఆయన సోత్తైనా ప్రజలుగా ఉన్నాము గనుక దేనికి భయపడ కూడదు అని తెలియజేస్తుంది. గనుక ఈ రోజంతా వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుడిచ్చు ధైర్యము గలవారమై జీవిద్దాం దేవుని గొప్ప ఆదరణ మనకు తోడై యుండును గాక ఆమెన్
No comments:
Post a Comment